calender_icon.png 1 March, 2025 | 9:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలి

01-03-2025 06:31:35 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): చదువుతో పాటు విద్యార్థులు ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలని  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో బస చేసిన కలెక్టర్ శనివారం ఉదయం 6 గంటలకు యోగా చేస్తున్న విద్యార్థులతో పాటు కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతీ రోజూ విద్యార్థులకు యోగా, వివిధ గేమ్స్ ఆడించాలని సంబంధిత ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పలువురు విద్యార్థులకు ఐఐటి ఆన్లైన్ తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులతో మాట్లాడారు. ఆన్లైన్ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని, ఐఐటిలో సీటు సాధించాలని అన్నారు. కలెక్టర్ తో పాటు ప్రిన్సిపాల్ రఘు పాల్గొన్నారు. 

పారిశుధ్య కార్యక్రమాలు పరిశీలన...

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలో పారిశుధ్య కార్యక్రమాలను కలెక్టర్ ఆశిష్ సంగువాన్ పరిశీలించారు. ప్రతీ రోజూ గ్రామంలోని చెత్తను సేకరించాలని, అదేవిధంగా ఇంటింటి చెత్తను తడి పొడి విడివిడిగా సేకరించాలని, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించాలని, ముఖ్యంగా జాతీయ రహదారి వెంబడి ఉన్న డాబా హోటల్ వద్ద చెత్తను తొలగించాలని తెలిపారు. పల్లె ప్రకృతి వనంను పరిశీలించి వేసవి దృష్ట్యా చెట్లకు నీళ్ళు పొయాలని తెలిపారు. అనంతరం రోడ్డు ప్రకటన ఉన్న చెట్లకు కలెక్టర్ నీళ్ళు పోశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివ ప్రసాద్, ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.