calender_icon.png 12 February, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

12-02-2025 12:55:31 AM

  1. మరో మహిళతో వివాహేతర సంబంధం
  2. సహనం కోల్పోయిన భార్య
  3. గ్రామస్థులతో కలిసి మహిళకూ దేహశుద్ధి

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి) : లక్షణంగా పెళ్లయింది. వారికి ఇద్దరు పిల్లలు, చేసేది పవిత్రమైన ఉపాధ్యాయ ఉద్యోగం. భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్ప రచుకొన్నాడు. ఎన్నిసార్లు హెచ్చరించిన పద్ధతి మారకపోవడంతో, కట్టుకున్న భార్య గ్రామస్తులతో కలిసి ఇరువురికి దేహశుద్ధి చేసిన వైనం జిల్లాలో చోటుచేసుకొంది.

వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం చుంచుపల్లి మండలం చుంచుపల్లి తండాలో అజ్మీరా హరిదాసు మునియా తండాలో గవర్నమెం ట్ టిచర్ విధులు నిర్వహిస్తున్నారు. ఇత నికి పదహేను సంవత్సరాల క్రితం  పా ల్వంచ మండలం పండురంగాపురం గ్రా మానికి చెందిన విజయ అనే మహిళతో మ హిళతో వివాహం జరిగింది. వీరికి  ఇద్దరు మగ పిల్లలు.

రోజు మాదిరిగానే యాద విధిగా స్కూల్ టైం కి వెళ్లి స్కూల్ ఐపోగానే వచ్చే హరిదాసు, కొంతకాలంగా రాత్రి వేళల్లో ఇంటికి రావడం మానేశాడు. అను మానం వచ్చిన భార్య విజయ భర్తను నలదే నిలదీయగా, చెప్పే సమాధానం పొంతన లేకపోవడంతో అనుమానం మరింత బల పడింది. భార్య ఒకసారి భర్తను అనుసరిం చి ఎక్కడికి వెళుతున్నాడు

అని వెంబ డించగా చుంచుపల్లి తండాలో మరో మహిళతో దొరికాడు. ఇరువురిని నిలదియ గా నేను ఈ మహిళను వివాహం చేసుకున్నాను నితో, నీ పిల్లలతో నాకు ఏటువంటి సంబంధం లేదు, ఈమెతోనే ఉంటా ను అని భార్యను కొట్టి పంపించేసాడు.

పా ల్వంచ పోలీస్ స్టేషన్ లో విజయ పిర్యాదు చేయగా ఎస్‌ఐ వారిని పిలిపించి మాటల డగా, ఎప్పుడో ఈ మహిళను పెళ్లి చేసుకు న్న అని, నా భార్యకి నాకు ఎటువంటి సంబంధం లేదనీ చెప్పడంతో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయిన  ఈ కీచక టీచర్ బుద్ధి మారలేదు.

ఇంటికి వచ్చి భార్యని పలు మార్లు విచక్షణ రహితంగా కొట్టే వాడు, భార్య తల్లితండ్రులు, బందు వులు ఎంత చెప్పినా పెడ చెవిన పెట్టి ఆ మహిళ దగ్గరికి వెల్లె వాడు, భార్య విజయకు తన జీతం నుండి ఒక రూపాయి కూడా ఇచ్చే వాడు కాదు,

ఇద్దరు పిల్లలు డిగ్రీ చదు వుతున్నా వారికి కాలేజీ ఫీజులు కట్టక, ఇంటిలో సరుకులు తీసుకురాక పోవడంతో విజయ ఎన్నో రోజులు పస్తులు పడుకునేది. ఓపిక పట్టిన విజయ సహనం కోల్పోయింది, కడుపు మండింది బంధువులతో కలిసి వెళ్లి భర్తకి, మహిళకు దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్‌లో మళ్ళీ ఫిర్యాదు చేశారు.