సూర్యాపేట, సెప్టెంబర్ 27: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఆకట్టుకున్నది. జిల్లాలోని వివిధ పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలను ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. వాటిని జిల్లాలోని అధికారులు, విద్యార్థులకు ఆసక్తిగా పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ స్టాళ్లల్లో ప్రదర్శించిన వివిధ రకాల పదార్థాలను పరిశీలించి కొనుగోలు చేశారు. చేపల స్టాల్ను ఎక్కువ మంది తిలకించి, చేపలతో చేసిన వివిధ రకాల వంటకాలను కొనుగోలు చేశారు.