తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’. 2021లో వచ్చిన ‘హసీన్ దిల్రుబా’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ తాజా సినిమాకు జయ్ప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు. కనికా ధిల్లాన్ నిర్మాత. మర్టర్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఆగస్టు 9 నుంచి ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ కనికా మాట్లాడుతూ.. ‘ప్రీక్వెల్లో భర్తతో కలిసి పక్కా ప్లాన్తో ప్రియుడిని అంతమొందించిన రాణి కశ్యప్.. తర్వాత అక్కడి నుంచి పారిపోయి కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంది.
ఈ కేసులో రాణిని తన భర్త కాపాడుతాడా? లేదా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే’ అని తెలిపారు. అయితే, ఈ చిత్రంలో తాప్సీ భర్తగా నటించిన విక్రాంత్ మాస్సే ‘మీర్జాపూర్’లో బబ్లూ పండిట్ పాత్ర ద్వారా తెలుగు వారికి పరిచయం కాగా.. ‘12th ఫెయిల్’లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.