గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్ పట్టణానికి చెందిన గంగాల నరేష్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో పీహెచ్డీ పట్టా పొందారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... డాక్టర్ బి ఇందిరా అసోసియేట్ ప్రొఫెసర్ సిబిఐటి గారి ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 'అప్లికేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండస్ట్రియల్, ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ అండ్ డేటా ఎనాలసిస్' పరిశోధనకు ఉస్మానియా యూనివర్సిటీ నుండి పీహెచ్డీ పొందినట్లు ఆయన తెలిపారు. గంగాల నరేష్ గతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా విధులు నిర్వహించడం జరిగింది.