calender_icon.png 9 October, 2024 | 1:57 PM

పీజీఈ సెట్ తుది విడుత సీట్ల కేటాయింపు

09-10-2024 02:02:09 AM

హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీజీ పీజీఈసెట్ తుది విడుత సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. మొత్తం 5,153 సీట్లకు గానూ 4,221 సీట్లు భర్తీ చేసినట్లు తెలిపారు. మొత్తం 7,014 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అందులో ఎంటెక్‌లో 2,297 మంది, ఎంఆర్కిటెక్చర్‌లో ఎనిమిది మంది, ఎంఫార్మ్, ఫార్మ్ (పీబీ)లో 1,916 మంది సీట్లు పొందారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 14 నుంచి 17లోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయలని అధికారులు సూచించారు.