21-03-2025 12:00:00 AM
కామారెడ్డి, మార్చి 20 ( విజయ క్రాంతి ): ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ కామారెడ్డి కళాశాల లో ఫిబ్రవరి నెల లో జరిగిన పీజీ ప్రథమ సంవత్సర (రెగ్యులర్) ఫలితాల ను తెలంగాణ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రో. కె.సంపత్ కుమార్ కళాశాల ప్రిన్సిపాల్ కె. విజయ్ కుమార్ గురువారం సంయుక్తం గా ఫలితాలను విడుదల చేశారు.
ఈ పరీక్షలలో విద్యార్థులు 75 శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా. కె.కిష్టయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ అడిషనల్ కంట్రోలర్ డా. సంపత్ ,కళాశాల పరీక్షల అదనపు నియంత్రణ అధికారులు రాములు, రాజేందర్ లు పాల్గొన్నారు.