20-03-2025 06:58:37 PM
కామారెడ్డి (విజయక్రాంతి): ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామారెడ్డి కళాశాలలో ఫిబ్రవరి నెలలో జరిగిన పీజీ ప్రథమ సంవత్సర (రెగ్యులర్) ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రో. కె.సంపత్ కుమార్ కళాశాల ప్రిన్సిపాల్ కె. విజయ్ కుమార్ గురువారం సంయుక్తంగా ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలలో విద్యార్థులు 75 శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డా. కె.కిష్టయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ అడిషనల్ కంట్రోలర్ డా. సంపత్, కళాశాల పరీక్షల అదనపు నియంత్రణ అధికారులు రాములు, రాజేందర్ లు పాల్గొన్నారు.