21న విచారించనున్న సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, అక్టోబర్ 18 (విజయక్రాంతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పరీక్షల నిర్వహణలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా అమ లు చేయలేదని దాఖలు చేసిన ఈ పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్టా లని అభ్యర్థుల తరపు న్యాయవాది మోహిత్రావు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని శుక్రవారం అభ్యర్థించారు.
తక్షణమే పిటిషన్ను విచారణ చేపట్టలేమని, ఈ నెల 21వ తేదీ సోమవారం విచారణ చేపడతామని ధర్మాసనం ప్రకటించింది. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు ఢిల్లీ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, సో మవారం సుప్రీంకోర్టు విచారణ అనంతరం ఉత్తర్వులు జారీచేసేవరకు తెలం గాణ సర్కార్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరారు.