calender_icon.png 23 October, 2024 | 8:32 PM

పాయంకు వినతి పత్రం అందజేత

23-10-2024 06:27:11 PM

పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని గుండాల మండలంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుండాల మాజీ ఎంపీపీ ముక్తి సత్యం, మాజీ సర్పంచ్ కోరం సీతారాములు బుధవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. గుండాల మండలంలోని పోతిరెడ్డిగూడెం, లక్ష్మీపురం, యాపలగడ్డ, గుండాల, మోదుగులగూడెం, నడిమిగూడెం, తూరుబాక గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అలాగే గలభ, చీమలగూడెం గ్రామాల ఊర చెరువులను అభివృద్ధి పరచాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడతో పాటు అభివృద్ధికి నిధులు కేటాయించాలని వారు ఎమ్మెల్యేను కోరారు. మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా మురుగు కాల్వలను ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎట్టి రాంబాబు, పాయం నాగేశ్వరరావు, పాయం నాగేశ్వరరావు, ప్రసాద్, చింతా వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.