23-02-2025 06:00:48 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): మాలి కులస్తుల ఎస్టీ హోదాపై బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపడం జరిగిందని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే అన్నారు. అ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లోనే ఉందని త్వరలోనే పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి మాలీలకు ఎస్టీ హోదా కల్పించేలా చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కోరారు. సంఘం రాష్ట్ర కోశాధికారి సతీష్ గురునూలేతో కలిసి ఆదివారం జిల్లా కేంద్రానికి వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని వినతిపత్రం అందించారు.