కడ్తాల్, ఫిబ్రవరి 1 ( విజయ క్రాంతి ) : కడ్తాల్ మండల మహాత్మా జ్యోతిరావు పూలె పాఠశాల యాచారం లో కొనసాగుతుందని వెంటనే కడ్తాల్ కు తరలించాలని కోరుతూ శనివారం హైద్రాబాద్ లో విద్యా కమిషన్ కార్యాలయంలో విద్యా కమిషన్ సభ్యులు ప్రొపెసర్ విశ్వేశ్వరయ్య, చారగొండ వెంకటేష్లను కలిసి వినతి పత్రం అందజేశారు. వినతి అందించిన వారిలో యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేందర్, తెలంగాణ బీసీ మహాసభ వ్యవస్థాపకులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్, భద్రమోని నరేష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.