07-03-2025 05:04:58 PM
నిర్మల్,(విజయక్రాంతి): బుద్ధుడు జ్ఞానోదయం సాధించిన బుద్ధ విఆర్ బుద్ధ గాయ ను అపవిత్రం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిర్మల్ బుద్ధ విహార్ ట్రస్ట్ సభ్యులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాంతంలో ఎంతోమంది బౌద్ధ స్వాములు తమ ఆచారాలను పాటిస్తున్న స్థలంపై కొందరు దాన్ని అపవిత్రం చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు మురళి, భుజంగరావు, సిద్ధార్థ, వెంకటస్వామి, రంజిత్, బొడ్డు లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.