calender_icon.png 22 October, 2024 | 5:35 AM

కరెంట్‌షాక్‌తో వ్యక్తి మృతి

21-10-2024 12:05:33 AM

సూర్యాపేట, అక్టోబర్ 20: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం ఖాసింపేట గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన పందుల జానకిరాములు(50) అదే గ్రామానికి చెందిన మద్ది శ్రీనివాస్ అనే రైతు పొలంలో రసాయన మందు పిచికారి చేసేందుకు శ్రీనివాస్, లింగయ్యలతో కలిసి వెళ్లాడు.

మందు పిచికారి చేస్తున్న క్రమంలో పొలంలో తెగిపడిన విద్యుత్ తీగపై కాలు వేయడంతో షాక్‌కు గురై మృతిచెందాడు. విద్యుత్ తీగలు తెగిపడినప్పటికీ నిర్లక్ష్యం వహించిన ఏఈ, లైన్‌మెన్‌లపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుమారుడు శివ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.