calender_icon.png 15 October, 2024 | 1:31 PM

కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

15-10-2024 11:07:02 AM

కాప్రా,(విజయక్రాంతి): విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్ లో నివాసముండే శివ నాయక్(23) చర్లపల్లి పారిశ్రామిక వాడ ఫేస్ 2లోని ఓ ఫార్మా కంపెనీలో ఎలక్ట్రిషియన్ గా  విధులు నిర్వహిస్తున్నాడు. పనిలో భాగముగా కంపెనీలో గోడకు డ్రిల్ చేస్తుండగా వైర్లు తగిలి షాక్ గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు గమనించి షాక్ గురైన శివ నాయక్ ను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. శివ నాయక్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని పరిశీలించి, తోటి కార్మికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.