హైదరాబాద్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి(45) ఆదివారం రాత్రి ఫలక్నామ రైల్వేస్టేషన్ల మద్య పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతునిపై ఒంటిపై పసుపుపచ్చ రంగు చొక్క, నలుపు రంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.4 ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ ఎల్లప్ప తెలిపారు.