08-04-2025 07:11:22 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు మంగళవారం దక్షిణ ప్రాంగణంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు విధులను బహిష్కరించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయ సహచార్యుల కోసం జీవో నెంబర్ 21 తీసుకువచ్చి కాంట్రాక్ట్ అధ్యాపకుల యొక్క పొట్ట కొట్టడం సరికాదన్నారు.
15 నుండి 20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం కొందరి ఉన్నత అధికారుల ప్రలోభాలకు తలోగ్గి, సరైన ప్రమాణాలను పాటించకుండా తమకు అన్యాయం చేస్తున్నారని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షంలో ఉండి రెగ్యులరైజ్ చేయాల్సిందే అని, లేనిపక్షంలో ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది, కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినప్పటికీ విశ్వవిద్యాలయ కాంట్రాక్ట్ అధ్యాపకుల పట్ల చిన్న చూపు చూడడం తగదన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి బేసిక్ ప్లస్ డి ఎ ప్లస్ హెచ్ఆర్ఏతో పాటు 3% ఇంక్రిమెంట్, ఉద్యోగ భద్రత కల్పించాలని . లేనిపక్షంలో తమ ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కాంట్రాక్ట్ అధ్యాపకుల పాత్ర వెలకట్టలేనిది, తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేషన్ కమిటీ మెంబర్స్ డాక్టర్. ఎస్ నారాయణ, హాస్టల్ వార్డెన్ డాక్టర్ యాలాద్రి, ఉమెన్స్ హాస్టల్ వార్డెన్ డా.సునీత, డాక్టర్ రమాదేవి, డాక్టర్ నర్సయ్య, అసిస్టెంట్ పి ఆర్ ఓ డాక్టర్ సరిత, నిరంజన్ శర్మ, శ్రీకాంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.