బెల్లంపల్లి(విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహించిన టైక్వాండో రాష్ట్రస్థాయి పోటీలలో బెల్లంపల్లికి చెందిన డి లాస్య గోల్డ్ మెడల్ సాధించింది. జి విజయ్ చంద్రప్రసాద్ సిల్వర్ మెడల్, షణ్ముఖ ప్రియా బ్రాంచ్ మెడల్ సాధించారు. వీరు ఉత్తరప్రదేశ్ ఆగ్రా లోని జాతీయస్థాయి పోటీలకు ఎన్నికయ్యారు. విజేతలను బుధవారం మంచిర్యాల జిల్లా తైక్వాండో అధ్యక్షుడు బుచ్చి రామారావు అలాగే మాస్టర్ జిల్లా పెళ్లి వెంకటస్వామి కోచ్ జంగా పెళ్లి అజయ్ బెల్లంపల్లి రైల్వే అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఏ గోపి, రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ రమేష్ లు అభినందించారు