calender_icon.png 22 September, 2024 | 3:52 PM

ఓపీఎస్ పునరుద్ధరణ జరపండి!

16-07-2024 12:00:00 AM

పాకాల శంకర్ గౌడ్ :

ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తున్నా ‘సీపీఎస్’ రద్దుకు కార్యాచరణ లేకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. సామాజిక, ఆర్థిక భద్రత కోసం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ‘ఓపీఎస్’ పునరుద్ధరణ దిశగా చర్యలు తీసుకొంటుందని వారు ఎదురు చూస్తున్నారు.

భారతదేశంలోని రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ‘సీపీఎస్’ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి ‘ఓపీఎస్’ (ఓల్డ్ పెన్షన్ స్కీమ్)ను పునరుద్ధరించాయి. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షల మేరకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తుతం ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వ ఉద్యోగులకు ‘పాత పెన్షన్ విధానం’ (ఓపీఎస్) అమలు చేస్తామని అభయహస్తం కింద గ్యారెంటీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తున్నా ‘సీపీఎస్’ రద్దు కోసం కార్యాచరణ లేకపోవడంతో ఉద్యో గ, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది.

ఉద్యో గుల సామాజిక, ఆర్థిక భద్రత కోసం ‘సీపీఎస్’ను రద్దు చేసి ‘ఓపీఎస్’ను పునరుద్ధరించాల్సి ఉంది. ఈ అసెంబ్లీ స మావేశాల్లో ‘ఓపీఎస్’ పునరుద్ధరణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులు, ఉద్యోగంలో ఉండ గా మరణిస్తే వారికి వచ్చే పెన్షన్ ప్రభుత్వం ఇచ్చే ఆసరా పెన్షన్ల కన్నా తక్కువ ఉన్న సందర్భాలు ఉన్నాయి. సామాజిక ఆర్థిక భద్రత లేక వారి కుటుంబాలు వీధిన పడ్డా యి. వారి కుటుంబాలకి భద్రత కల్పిస్తూ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ వారి జీవితాంతం ప్రజలకు సేవ చేసిన ఉద్యోగులను కాపాడాల్సిన సామాజిక బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

ఆర్థిక భద్రత కావాలి

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 3.69 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. నూతన ఉద్యోగ నియామకాల వల్ల ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకా శం ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారుల వర కు దాదాపు రెండు లక్షలమంది ఉద్యోగులు ‘కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్’ (సీపీ ఎస్) పరిధిలో పని చేస్తున్నారు. 1 జనవరి 2004 తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘నూతన పెన్షన్ స్కీం’ (ఎన్పీఎస్) లేదా (సీపీఎస్)ను వర్తింపచేస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకంలో 18 నుండి 60 సం వత్సరాల వయసుగల భారత పౌరులు ఎవరైనా చేరవచ్చు. చేరిన ప్రతి వ్యక్తికి ప్రాన్ (పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నం బర్) కార్డు జారీ చేస్తారు. అప్పటి వరకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓపీఎస్ (ఓల్ పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి దాని స్థానే ‘సీపీఎస్’ని తీసుకువచ్చారు. ‘సీపీఎస్’ పద్ధతిని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దేశంలోని మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. పెన్షన్ల ఆర్థిక భారం ప్రభుత్వాలపై పడకుండా ఉండడానికి ఈ ‘సీపీఎస్’ని తీసుకువచ్చారు. కానీ, ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రతను విస్మరించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఎంఎస్ 653 తేదీ. 22-.9.2004 ప్రకారం 1సెప్టెంబర్ 2004 నుండి సర్వీసులో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయాల ఉద్యోగులు, గ్రాండ్ ఇన్ ఎయిడ్ పొందుతున్న సంస్థల్లోని ఉద్యోగులు, అటానమస్ కార్పొరే షన్ పరిధిలోని ఉద్యోగులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశా రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీపీఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్వయిం చుకుంటూ 23 ఆగస్టు 2014న జీవోను జారీ చేసింది. దీనితో 1 సెప్టెంబర్ 2004 తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరినీ సీపీఎస్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు అయింది.

ఢిల్లీకి పాకిన ఉద్యమ తీవ్రత

ఉద్యోగ, ఉపాధ్యాయులు సీపీఎస్ పరిధిలో పని చేయడం వల్ల రిటైర్మెంట్ సమ యంలో వచ్చే 50% పెన్షన్, కుటుంబ సభ్యులకు 30% పెన్షన్, కనీసం 16 లక్షల గ్రాట్యుటి, కమ్యూటేషన్ వంటి సౌకర్యాల ను కోల్పోతున్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నప్ప టి నుంచి దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపా ధ్యాయ సంఘాలు ఉద్యమాలు చేయడం ప్రారంభించాయి. ఈ ఉద్యమాల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే గల్లీలో ప్రారంభమైన ఉద్యమాలు ఢిల్లీ వరకు చేరాయి. గతంలో ‘స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎస్‌టీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో సీపీఎస్ రద్దు కోరుతూ ‘చలో పార్లమెంట్’ని ఉద్యోగ, ఉపాధ్యాయులు నిర్వహిం చారు. ‘సెప్టెంబర్ 1’ని పెన్షన్ విద్రోహ ది నంగా పాటిస్తూ అనేక కార్యక్రమాల ద్వా రా ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం నిరసనలు తెలియజేస్తూనే వున్నా రు. కేవలం సీపీఎస్ రద్దు కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో సీపీఎస్ సంఘాలు ఏర్ప డడం గమనార్హం. 

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి విచారకరం

సీపీఎస్ ఉద్యోగి తన బేసిక్ పే డిఏలతో కలిపి 10%, మ్యాచింగ్ గ్రాంట్‌గా ప్రభు త్వం నుంచి మరో 10% సొమ్మును కలిపి ‘నేషనల్ పెన్షన్ స్కీం ట్రస్ట్’ (ఎన్‌పీఎస్‌టీ)లో జమ చేస్తారు. ఉద్యోగికి కేటాయిం చిన ‘పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నం బర్’ (ప్రాన్)లో ఈ సొమ్ము జమవుతుం ది. ఉద్యోగి పదవీ విరమణ పొందే వరకు జమ అయిన మొత్తం నుంచి 60% డబ్బు ను మాత్రమే ఉద్యోగికి నగదుగా చెల్లిస్తా రు. మిగతా 40% డబ్బును భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెడతారు. దానిపై వచ్చే లాభాన్ని నెలవారీ పెన్షన్ కింద రిటైర్డ్ ఉద్యోగికి చెల్లిస్తారు. ఒకవేళ షేర్ మార్కెట్ నష్టాలను చవి చూస్తే ఉద్యో గి డబ్బుల నుంచి తీసుకుంటారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల డబ్బులు స్టాక్ మార్కెట్లో పెట్టి స్టాక్ మార్కెట్ లాభనష్టాలపై ఉద్యోగి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా విచారకరం.

వారి సొమ్ముకు ఆర్థిక భద్రత లేకుండా పోతుంది. ‘సీపీఎస్’ విధానం నష్టదాయకంగా ఉందని దానిని రద్దు చేసి ‘ఓపీఎస్’ ని అమలు చేయాలని ఉద్యోగ ఉపాధ్యా య సంఘాలు  ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. ‘సీపీఎస్’ని రద్దు చేసుకునే అధి కారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెం ట్ అథారిటీ’ (పీఎఫ్‌ఆర్‌డీఏ) చట్టం వీలు కల్పిస్తున్నది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా వారి ఉద్యోగుల సామాజిక ఆర్థిక భద్రత కోసం ‘సీపీఎస్’ని రద్దు చేయాలనుకుంటే ఆ మేరకు రద్దు చేసుకునే స్వేచ్ఛ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీపీఎస్ ఉ ద్యోగుల కోసం జీవో ఎంఎస్ నంబర్ 58 తేదీ 11.6.2021 ప్రకారం ఉద్యోగి మరణిస్తే వారి వారసులకు కుటుంబ పెన్షన్ చెల్లించడం జరుగుతుందని ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో అప్పటి వరకు ఉద్యో గి జీతం నుండి మినహాయించిన సీపీఎస్ చందా మొత్తం ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి ఉంటుంది.

‘ఎంప్లాయ్ ఫ్రెండ్లీ’ ప్రభుత్వంపై ఆశలు

తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏండ్లుగా సీపీఎస్ రద్దు కోసం పోరాటం చేస్తున్నాయి. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నది. పీ ఆర్సీ బకాయిలను కూడా చెల్లిస్తున్నది. ఏం డ్లుగా సాధ్యం కానీ ఉపాధ్యాయుల ప్రమోషన్లకు మోక్షం కల్పించింది. 317 జీవో బాధితుల పక్షాన సానుకూల నిర్ణయం తీసుకునే చర్య లు ప్రారంభించి ‘ఎంప్లాయ్ ఫ్రెండ్లీ’ ప్రభుత్వంగా నిలిచింది. అలాగే, ఎన్నికల మేని ఫెస్టోలో అభయహస్తంలో ఇచ్చిన గ్యారంటీ  ప్రకారం ‘సీపీఎస్’ని కూ డా రద్దు చేసి ‘ఓపీఎస్’ను పునరుద్ధరిస్తుందని ఉద్యోగ, ఉపా ధ్యాయులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రెండు లక్షలమంది ‘సీపీఎస్’ ఉద్యో గుల కుటుంబాల్లో వెలుగులు నింపుతారని ఆశిస్తున్నారు. ప్రభుత్వం ‘ఓపీఎస్’ను పునరుద్ధరించి ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన నిలవాలని అందరూ కోరుకుంటున్నారు.

వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు

సెల్: 9848377734