calender_icon.png 18 October, 2024 | 5:57 PM

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చిన అండగా ఉంటా...

18-10-2024 03:00:13 PM

కూకట్‌పల్లికూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలో రోడ్లు, డ్రైనేజి, మంచినీటి సమస్య ఇక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆల్లాపూర్ డివిజన్ లోని పలు సమస్యలపై స్థానిక డివిజన్ కార్పొరేటర్ సబిహ గౌసుద్దీన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు తప్ప ఇప్పటికి ఒక అభివృద్ధి పని కూడా ముందుకు సాగలేదని అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. అల్లాపూర్ డివిజన్ లో  ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. ఎన్నో ఏళ్లుగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్న రాజీవ్ గాంధీ నగర్, సఫ్దర్ నగర్ ప్రజలు భయభ్రాంతులకు గురికావద్దని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిరుపేదలు నివాసం ఉంటున్న వారి జోలికి వస్తే తాను అండగా నిలబడతానని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు గౌసిద్దిన్, ఐలయ్య, వీరారెడ్డి, బాబా తో పాటు పలు కాలనీల అసోసియేషన్ ల సభ్యులు పాల్గొన్నారు.