calender_icon.png 25 October, 2024 | 7:09 AM

టూరిస్ట్ ప్రదేశాలు చూపిస్తామని జనాన్ని తరలించారు

25-10-2024 02:20:50 AM

ప్రియాంక సభపై బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ వ్యాఖ్యలు

వయనాడ్, అక్టోబర్ 24: వయనాడ్ ఎంపీ స్థానానికి బుధవారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ నామినేషన్ దాఖలు చేయగా, ఈ సందర్భంగా ఆమె నిర్వహించిన రోడ్ షోపై బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ విమర్శలు గుప్పించారు. టూరిస్ట్ ప్రదేశానికి తీసుకు వెళ్తామని ప్రజలకు అబద్ధం చెప్పి ప్రియాంక సభకు జనాన్ని తరలించారని ఎద్దేవా చేశారు.

‘ఆమె పేరున్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చా రు. నేను కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ప్రజల కోసం ఏండ్లుగా పనిచేశా. ఒక అభ్యర్థి గొప్పదనం వారి కు టుంబ నేపథ్యమే అయితే అది ఆమె కు మాత్రమే చెందుతుంది. బీజేపీ లో కుటుంబ రాజకీయాలకు స్థానం లేదు. ఆమె రోడ్ షోలు నిర్వహించిడం ఫెస్టివల్ సీజన్ లాంటిది.

ప్రజ లు అన్నింటినీ చూస్తున్నారు’ అని హరిదాస్ పేర్కొన్నారు. కాగా నవ్యా హరిదాస్ గురువారం బీజేపీ తరఫున నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి గెలిచిన రాహుల్ గాంధీ.. వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. వచ్చేనెల 13న ఎన్నికలు జరుగుతాయి.