సంగారెడ్డి ఎస్పీ రూపేష్
సంగారెడ్డి, అక్టోబర్ 18 (విజయక్రాంతి): శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని సంగారెడ్డి ఎస్పీ చెన్నూర్ రూపేష్ అన్నారు. గురువారం రాత్రి మునిపల్లి గ్రామంలో పర్యటించిన ఎస్పీ.. గ్రామస్థులతో ముచ్చటించి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. మునిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన ఉన్న రౌడీలు, అనుమానితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారితో మా ట్లాడి చేస్తున్న పని గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉం డాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సంజీవరావు, కొండాపూర్ సీఐ చంద్రయ్య, ఎస్సై రాజేశ్వర్ పాల్గొన్నారు.