కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): హత్య కేసు లో 16 మందికి జీవిత ఖైదుతో పాటు రూ.1.49 లక్షల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ సెషన్ కోర్టు ప్రధాన న్యాయాధికారి ఎంవీ రమేష్ బుధవారం తీర్పునిచ్చారు. రెబ్బెన మండలంలోని సింగల్ గూడ గ్రామానికి చెందిన ఆజ్మీర రమేష్ కొన్ని రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ప్రధాన నిందితుడు జర్పుల సురేష్తో పాటు సత్యవతి, వసంత్రావు, తిక్యనాయక్, హరీష్, అరవిం ద్, నవీన్, ప్రవీణ్, సంతోష్, ప్రవీణ్కుమార్, లక్ష్మి, రజిత, తుకారం, రవి, రాజు, బిఖ్యానాయక్లను అరెస్టు చేశారు. విచారించిన న్యాయాధికారి బుధవారం తీర్పునిచ్చారు.