నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): వారాంతాల్లో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 12, 13 తేదీలలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 238 మందు బాబులు పట్టుబడ్డారు. ఇందులో 184 మంది ద్విచక్రవాహనదారు లు, 13 మంది ఆటో డ్రైవర్లు, 39 కారు డ్రైవ ర్లు, ఇద్దరు హెవీ వెహికిల్ డ్రైవర్లు ఉన్నారు. వీరిలో 20 మందికి పరీక్షల్లో బీఏసీ(బ్లడ్ అల్కహాల్ కాంటెంట్) 200 నుంచి 550 శాతం వరకు వచ్చింది. పట్టుబడిన వారందరినీ సోమవారం కోర్టులో హాజరుపరుచను న్నట్లు పోలీసులు పేర్కొన్నారు.