10-02-2025 12:25:38 AM
దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 41 మంది సజీవ దహనమయ్యారు. కాన్సున్ నుంచి టబాస్కోకు సుమారు 48 మందితో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు అక్కడి అధికారులు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో 38 మంది ప్రయా ణికులు సహా బస్సులోని ఇద్దరు డ్రైవర్లు, టక్రుకు సంబంధించిన ఓ డ్రైవర్ మరణించినట్టు వివరించారు. ప్రమాద ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైందని అధికారులు చెప్పారు.