calender_icon.png 25 October, 2024 | 6:55 AM

గ్రూప్-1కు 21,264 మంది హాజరు

25-10-2024 01:37:23 AM

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. గురువారం పేప ర్‌డూ పరీక్షను 46 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 31,383 మందికిగానూ 21,264 మంది పరీక్షకు హాజరైనట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికో లస్ తెలిపారు. 67.7 శాతం మంది హాజరయ్యారు. ఈనెల 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నా యి. పేపర్-3లో సామాజిక అంశాలపై పరిజ్ఞాన్ని పరీక్షించేలా టీజీపీఎస్సీ ప్రశ్నలు అడిగిందని అభ్యర్థులు పేర్కొన్నారు.

ముఖ్యంగా 2013 ఆహార భద్రత చట్టం, ప్రాథమిక హక్కులు - ఆర్టికల్ 21, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు, అంతర్రాష్ట్ర జలవివాదాలు తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చినట్లు తెలిపారు. నిర్ణీత గడువులో అన్నీ ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి సమయం సరిపోలేదని అభ్యర్థులు అభిప్రాయ పడ్డారు.