calender_icon.png 17 October, 2024 | 11:02 PM

పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పూర్తి చేయాలి

17-10-2024 07:59:54 PM

అధికారులను ఆదేశించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉన్న ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలన్నారు. తమ పరిధిలో ఉన్న దరఖాస్తు ల్లో రోజుకు 10 దరఖాస్తులను పరిష్కరించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలనలో ప్రభుత్వ భూమి, కోర్టు కేసులో ఉందా, ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుందా అనే అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. క్షేత్రస్థాయిలో  పర్యటించి భూమి వివరాలు గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. పరిశీలించాలన్నారు. ప్రతి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లాలోని తాహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.