calender_icon.png 25 September, 2024 | 8:08 AM

ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి

25-09-2024 12:33:08 AM

ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీజీవో, టీఎన్జీవో, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఫోర్త్ క్లాస్‌తో కలిపి మొత్తం 205  సంఘాలతో నిర్వహించిన సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు, అన్ని బిల్లులు క్లియర్ చేయాలని కోరారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పీఆర్సీ నివేదికను ప్రకటించి దాన్ని అమలు చేయాలని విన్నవించారు.