calender_icon.png 26 October, 2024 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ ఫీజులు విడుదల చేయాలి

23-07-2024 01:42:23 AM

యాదాద్రి భువనగిరి, జూలై 22 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలనే డిమాండ్‌తో సోమవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భువనగిరిలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డగించడంతో అక్కడే రాస్తారోకో చేపట్టి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ.. రూ.7 వేల కోట్ల బకాయిల కారణంగా విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎడ్ల మహాలింగం, మణికంఠ గౌడ్, వట్టె మధు, సతీశ్ కుమార్, మహేశ్, రమాదేవి, మానస, సుప్రియ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.