calender_icon.png 16 October, 2024 | 9:51 PM

పెండింగ్ డీఏలు విడుదల చేయాలి

16-10-2024 03:31:50 AM

సీఎస్‌కు టీఎన్జీవో నేతల విజ్ఞప్తి

హైదరాబాద్, అక్టోబర్15(విజయ క్రాంతి): ఉద్యోగుల పెండింగ్ డీఏల విడుదలతో పాటు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎన్జీ వో సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారిని సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జగదీశ్వర్, ముజీబ్ హుస్సేన్ మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు.

స్టాండింగ్ కౌన్సెలింగ్ సమావేశం ఏర్పాటు చేయాలని, ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన తెలంగాణ ఉద్యోగులకు పోస్టింగ్ ఇచ్చి జీతాలు చెల్లించాలని ఆమెను కోరా రు. పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

జీవో నెంబర్ 317ను పునఃసమీక్షించాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని కోరారు. దీని పై స్పందించిన సీఎస్ త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కరిస్తామని వారితో చెప్పినట్లు పేర్కొన్నారు. సీఎస్‌ను కలిసిన వారిలో సంఘం నాయకులు ముత్యాల సత్యనారాయణ గౌడ్, కే శ్రీకాంత్, హరికృష్ణ ఉన్నారు.