పెబ్బేరు,(విజయక్రాంతి): వనపర్తి జిల్లోని పెబ్బేరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... ఒక కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించేందుకు మున్సిపల్ కార్యాలయానికి వస్తే కమిషనర్ ఆదిశేషు బిల్లులపై సంతకం చేసేందుకు లంచం డిమాండ్ చేశారు.
దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ మహబూబ్ నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారుల సూచన మేరకు మంగళవారం పెబ్బేరు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన కాంట్రాక్టర్ కమిషనర్ ఆదిశేషును కలిసి రూ.20 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు మహబూబ్ నగర్ ఏసీబీ అడిషనల్ ఏస్సీ బి.శ్రీకృష్ణ గౌడ్ తెలిపారు. కమిషనర్ ను అదుపులోకి తీసుకొని పెబ్బేరు మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.