కరీంనగర్, (విజయక్రాంతి): తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం శాంతి ర్యాలీ జరిగింది. గత మూడు సంవత్సరాలుగా పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయాలని కోరుతూ కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. మూడు రోజులుగా బంద్ నిర్వహిస్తున్న విద్యాసంస్థలు గురువారం ఆందోళన కార్యక్రమంలో భాగంగా శాంతి ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.