calender_icon.png 8 October, 2024 | 11:58 PM

లాలూ కుటుంబానికి ఊరట

08-10-2024 01:39:16 AM

రైల్వే ఉద్యోగాల కేసులో  ఆయనతో పాటు ఇద్దరు కుమారులకు బెయిల్

పాట్నా, అక్టోబర్ 7: రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసులో బిహార్ మాజీ సీఎం లాలూప్రసాద్‌యాదవ్‌తో పాటు ఆయన కుమారులు తేజస్వీయాదవ్, తేజ్‌ప్రతాప్‌కు బెయిల్ మంజూరైంది. రౌస్‌అవెన్యూ కోర్టు లో వీరు పిటిషన్ దాఖలు చేయగా సోమవారం జస్టిస్ విశాల్‌గోగ్నే షరతులతో బెయి ల్ మంజూరు చేశారు. పూచీకత్తుగా రూ.లక్ష చెల్లించాలని, పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని సూచించారు. 

సోఫాలు ఎత్తుకెళ్లారు: బీజేపీ 

తేజస్వీయాదవ్‌పై బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్‌చౌదరి కార్యదర్శి, బీజేపీ నేత శత్రుధన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు.  అధికారి క నివాసాన్ని ఖాళీ చేసే సమయంలో తేజస్వీ బంగ్లాలోని ఏసీలు, సోఫాలు, బెడ్, వాష్ రూంలో ట్యాప్‌లను ఎత్తుకెళ్లారని ఆరోపించారు. ఆర్జేడీ జేడీయూ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో తేజస్వీ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. తర్వా త ఆ ప్రభుత్వం పడిపోవడంతో ఆయన తన పదవిని కోల్పోయారు.