రాంచీ: 14వ జూనియర్ మహిళల నేషనల్ హాకీ చాంపియన్షిప్లో ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ జట్లు తమ తుది రౌండ్ మ్యాచుల్లో విజయం సాధించినా కానీ క్వార్టర్స్కు అర్హత సాధించడంలో విఫలం అయ్యాయి. ఢిల్లీ జట్టు 2-1 తేడాతో పుదుచ్చేరి మీద, బెంగాల్ 9-1 తేడాతో బీహర్ మీద విజయం సాధించాయి. క్వార్టర్స్లో మధ్యప్రదేశ్ జట్టు ఉత్తర్ప్రదేశ్తో, జార్ఖండ్ x మహారాష్ట్రతో.. హర్యానా x పంజాబ్తో, చత్తీస్గఢ్ x ఒడిషాతో తలపడనున్నాయి.