calender_icon.png 24 October, 2024 | 5:43 PM

ప్రతిపక్షాలకు పీసీసీ చీఫ్ కీలక సూచనలు

24-10-2024 03:21:47 PM

హైదరాబాద్: ప్రతిపక్షాలు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి.. ప్రజలు కూడా వాస్తవాలను గ్రహించాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. పదినెలల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశామని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలపై కేటీఆర్ భారీగా ఖర్చు చేస్తున్నారని పీసీసీ ఛీప్ ఆరోపించారు. హైడ్రా, మూసీ సుందరీకరణపై బురదజల్లుతున్నారని విమర్శించారు. డీపీఆర్ కు రూ. 141 కోట్ల వ్యయం చేస్తున్నాం.. మూసీకి వేల కోట్లు ఖర్చువుతుందని అనుకుంటున్నామని తెలిపారు.