calender_icon.png 17 October, 2024 | 3:31 PM

గాంధీ భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులతో పీసీసీ చీఫ్‌ చర్చలు

17-10-2024 01:21:54 PM

హైదరాబాద్: గాంధీభవన్ వద్ద అరెస్ట్ చేసిన గ్రూప్-1 అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఐని కోరారు. ఒంటి గంటకు గ్రూప్ - అభ్యర్థులకు పీసీసీ చీఫ్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. గాంధీ భవన్ కు రావాలని గ్రూప్ వన్ అభ్యర్థులకు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. గురువారం గాంధీ భవన్ లో గ్రూప్ వన్ అభ్యర్థులకు ఆయన చర్చించనున్నారు. పీసీసీ అధ్యక్షుడిని కలవడానికి గాంధీ భవన్‌ వద్దకు వెళ్లిన గ్రూప్‌-1 అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.