calender_icon.png 4 October, 2024 | 2:51 PM

నేడు ఇందూరులో పీసీసీ చీఫ్‌కు సన్మానం

04-10-2024 12:00:00 AM

సభను విజయవంతం చేయండి 

డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి

నిజామాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : జిల్లాకు చెందిన మహేశ్‌కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్‌గా నియమితులవ్వడం ఆనందంగా ఉందని, పీసీసీ అధ్యక్షుడిగా నియామకం అయిన తర్వాత జిల్లాకు  మొదటిసారి వస్తున్న సందర్భంగా ఆయనకు సన్మాన సభను నిర్వహిస్తున్నట్టు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి తెలిపారు.

నిజామాబాద్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. కష్టపడ్డ వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందననడానికి మ హేశ్‌కుమార్‌గౌడ్ నిదర్శనమని చెప్పారు. పార్టీలో గ్రామస్థాయి ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రా రంభించిన మహేశ్‌కుమార్‌గౌడ్.. ఎన్నో పదవులు నిర్వహిస్తూ పీసీసీ చీఫ్‌గా ఎదిగారని కొనియాడారు. శుక్రవారం నిర్వహించే స్వాగత ర్యాలీ, సన్మాన సభలో కార్యకర్తలు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో తతరాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్‌బిన్ హందాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడే కేశ వేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్‌రెడ్డి, నాయకులు రత్నాకర్, ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా యూత్ అధ్యక్షుడు విక్కీ యాదవ్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వేణురాజ్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి విపుల్ గౌడ్ పాల్గొన్నారు.