27-03-2025 12:29:31 AM
మున్సిపల్ కమిషనర్ తిరుపతి
అందోల్, మార్చి 26 :ఆందోల్ - జోగిపేట మున్సిపల్ పురపాలక సంఘం లొ ఆస్తి పన్ను బకాయిలపై విధించబడిన వడ్డీలో 90% మాఫీ చేస్తూ, ఆస్తి పన్ను బకాయిదారులందరికీ వెసులుబాటు కల్పిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెలాఖరు వరకు మాత్రమే ఈ అవకాశం ఉందన్నారు. ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలని అన్ని మున్సిపాలిటీలలో ఈ అవకాశం వర్తించేలా ఓటిఎస్ స్కీం అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఆస్తిపన్ను చెల్లింపుదారులందరూ చెల్లించవలసి ఉన్న మొత్తం ఆస్తి పన్నులు వెంటనే చెల్లించి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.