డిప్యూటీ సీఎం భట్టీకి టీఎస్ యూటీఎఫ్ వినతి
హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు, ఇతర బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి యూటీఎఫ్ నేతలు కే జంగయ్య, చావ రవి రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్, టీఎస్ జీఎల్ఐ, సప్లిమెంటరీ వేతనాలు, సరెండర్ లీవులు, గత పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని కోరారు.