హైదరాబాద్: ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ కి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని రాజేంద్ర ప్రసాద్ కి ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన కుమార్తెలలో ఒకరైన గాయత్రిని 38 ఏళ్ల వయస్సులో కోల్పోయారు. ఆమెకు నిన్న అర్థరాత్రి ఛాతీ నొప్పి రావడంతో వెంటనే హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. దురదృష్టవశాత్తు, వైద్య ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె ఈ తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించింది.