అమరావతి, అక్టోబర్ 2: తిరుపతి లడ్డు కల్తీ ఆరోపణల నేపథ్యంలో ప్రా యశ్చిత్త దీక్ష ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ తిరుపతిలో బుధవారం తన దీక్షను విరమించారు. కుమార్తెలు ఆద్య, పొలెనాతో కలిసి తిరుపతి శ్రీవారిని దర్శిం చుకొని దీక్ష విరమిచారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి చిత్రప టం, తీర్థప్రసాదాలు అందించారు. ఆయన 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగించారు. స్వామివారి దర్శనానికి ముందు తన కూతుళ్లతో కలిసి అక్కడి డిక్లరేషన్ బుక్లో డిక్లరేషన్ ఇచ్చి సంతకాలు చేశారు.