calender_icon.png 2 October, 2024 | 4:11 AM

ఆసుపత్రిలో రోగి ఆత్మహత్య

01-10-2024 12:00:00 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): చికిత్స కోసం వచ్చిన ఓ రోగి ప్రవేట్ ఆసుపత్రిలోని బాత్రూ ంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. కా మారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రానికి చెందిన సాయిలు(38)కు చేతికి గాయం కావడంతో ఇన్‌ఫెక్షన్ గా మారింది. కుటుంబ సభ్యులు సాయిలును కామారెడ్డిలోని ఓ ప్రై వేటు ఆసుపత్రిలో చేర్పించారు. అ యితే ఇన్‌ఫెక్షన్ తగ్గదేమోనని కలత చెందిన సాయిలు ఆసుపత్రిలోని బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.