11-12-2024 01:06:40 AM
నిజామాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుప త్రి భవనం పైనుంచి దూకి రోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. నగరంలోని నాగారం ప్రాంతానికి చెం దిన మట్ల లక్ష్మణ్(50) అనారోగ్యంలోతో జీజీహెచ్లో చేరి చికిత్స పొందు తున్నాడు. ఈ క్రమంలోనే ఆసుపత్రి భవనం ఆరో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.