calender_icon.png 18 October, 2024 | 11:45 PM

ఉద్యమకారులకు పార్టీలు సీట్లు ఇవ్వాలి

16-10-2024 01:43:14 AM

ఉద్యమకారుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు శ్రీశైలం 

ఆదిలాబాద్‌ఓయూ పాదయాత్ర ప్రారంభం

ఆదిలాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాం తి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమకారులకు సీట్లు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకా రుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు దాసర్ల శ్రీశై లం డిమాండ్ చేశారు.

ప్రత్యేక రాష్ర్ట సాధన ఉద్యమ ఆకాంక్షల అమలు కోరుతూ ఆదిలాబాద్ నుంచి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వర కు చేపట్టిన పాదయాత్రను మంగళవారం ఆ దిలాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భ ంగా దాసర్ల శ్రీశైలం మాట్లాడుతూ.. తెలంగా ణ ఉద్యమకారుల ఆకాంక్షలకు కేసీఆర్ ప్రభు తం తూట్లు పొడిచే విధంగా వ్యవహరించిందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కా ంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి 250 గజాల ఇంటి స్థలం మంజూరు, ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయానలి కోరారు. పాదయాత్ర ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలకు ఈ నెల 29న చేరుకుంటుందన్నారు.