10-03-2025 01:32:47 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా ఎస్పీగా పరితోష్ పంకజ్(Paritosh Pankaj) బాధ్యతలు స్వీకరించారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని ఎస్పీ కార్యాలయానికి బాధితులు స్వీకరించేందుకు పరితోష్ పంకజ్ రాగ బదిలీపై వెళుతున్న ఎస్పి చెన్నూరు రూపేష్, అదనపు ఎస్పీ సంజీవరావులు ఘన స్వాగతం పలికారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పంకజ్ పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. గతంలో ఎస్పీగా పని చేసిన రూపేష్ నార్కోటిక్ బ్యూరోకి బదిలీ వెళుతున్నారు.