బీఆర్ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కాళేశ్వరం నిర్మాణంతో ఆలేరులో పచ్చని పంటలు కనిపిస్తున్నాయని, మల్లన్నసాగర్ నీళ్లతో గందమల్ల మత్తడి దుంకుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ నాడు గొల్లుమన్న గొలుసుకట్టు చెరువులకు నేడు జలకళ వచ్చిందన్నారు. కాళేశ్వరం మీద దుమ్మెత్తిపోసి, మలన్నసాగర్కు శాపాలు పెట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పడు పూజలు చేసి నెత్తిన నీళ్లుజల్లుకుంటున్నారని ఎద్దే వా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నం పెట్టే రైతన్నపై దౌర్జన్యాలకు పాల్పడుతుందని విమర్శించారు.