చైనా ఓపెన్
బీజింగ్: చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మహిళల ప్రపంచ నంబర్వన్ అరీనా సబలెంకా రెండో రౌండ్కు చేరుకుంది. సబలెంకాతో పాటు మూడో సీడ్ జాస్మిన్ పవోలిని కూడా ముందంజ వేసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పవోలిని (ఇటలీ) 1-6, 7-5, 6 బుక్సా (స్పెయిన్)ను ఓడించి రెండో రౌండ్లో అడుగుపెట్టింది.
ఇక సబలెంకా (బెలారస్) 6-4, 6-1తో సవాంగ్కే (థాయ్లాండ్)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. మిగిలిన మ్యాచ్ల్లో మాడిసన్ కీస్, జెంగ్, మయియాలు ముందంజ వేయగా.. ఏడో సీడ్ క్రేజికోవా పరాజయం చవిచూసింది. పురుషుల సింగిల్స్లో నంబర్వన్ జానిక్ సిన్నర్, లెహెకా, కొబొలి, మెద్వెదెవ్లు క్వార్టర్స్కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్లో భారత స్టార్ రోహన్ బోపన్న (క్రొయేషియా) జంట తొలి రౌండ్లోనే పరాజయం చవిచూసింది.