calender_icon.png 27 September, 2024 | 5:46 AM

దూసుకొచ్చిన పంత్

26-09-2024 12:00:00 AM

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్

దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అదరగొట్టాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన పంత్ ర్యాంకింగ్స్‌లో టాప్ దూసుకొచ్చాడు. బుధవారం విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పంత్ 731 పాయింట్లతో ఆరో స్థానం దక్కించుకున్నాడు.

ఓపెనర్ యశస్వి జైస్వాల్ 751 పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకాడు. భారత కెప్టెన్ రోహిత్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐదు స్థానాలు దిగజారి వరుసగా 10, 12వ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్ జోరూట్  తొలి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే..

న్యూజిలాండ్‌తో టెస్టులో సత్తా చాటిన శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్య 743 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలవగా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ (871 పాయింట్లు), మరో భారత బౌలర్ బుమ్రా (854 పాయింట్లు) తొలి రెండు స్థానాలు నిలబెట్టుకున్నారు.