calender_icon.png 25 October, 2024 | 9:01 AM

ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఈఈ

25-10-2024 01:31:43 AM

  1. కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు తీసుకుంటూ..
  2. ఈఈతోపాటు మరో ఇద్దరు  అధికారులు

మహాదేవపూర్, అక్టోబర్ 24: బిల్లులు క్లియరెన్స్ చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ భూపాలపల్లి జిల్లా పంచాయతీరాజ్ అధికారులు గురువారం ఏసీబీకి చిక్కారు. ఈఈ దిలీప్ కుమార్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ చంద్రశేఖర్, సీనియర్ అసిస్టెంట్ శోభారాణిని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

బిల్లులు చెల్లించేందుకు ఓ కాంట్రాక్టర్‌ను రూ.20 వేలు డిమాండ్  చేశారు. సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. కాంట్రాక్టర్ వద్ద నుంచి 20 వేలు తీసుకుంటండగా ముగ్గురిని  రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒకేరోజు ముగ్గురు అధికారులు  ఏసీబీకి చిక్కడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.