calender_icon.png 19 April, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టరేట్ వద్ద పంచాయతీ కార్మికుల ధర్నా

18-04-2025 12:01:36 AM

మేడ్చల్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): ఐదు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వేతనాలు విడుదల చేయాలని నినాదాలు చేశారు. డిపిఓ కార్యాలయంలో మెమోరాండం సమర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఐదు నెలలుగా వేతనాలు అందనందున కార్మికుల పరిస్థితి దుర్భరంగా తయారైంది అన్నారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మేడ్చల్ జిల్లా కోశాధికారి ఉన్ని కృష్ణన్, పంచాయతీ కార్మిక నాయకులు సుధాకర్, ఆరోగ్యం, ప్రశాంత్, శ్రీనివాస్, కృష్ణ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.